దేశం లో కరోన విస్తరిస్తున్న నేపద్యంలో కరోనాను ఎదుర్కొనే క్రమములో బాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు యాప్ ప్రధాని నరేంద్ర మోడి పిలుపు మేరకు అనతి కాలంలోనే ప్రజలలోకి చెరువైంది . ఏప్రిల్ రెండున ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ 9.8 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ మంగళవారం నుంచి జియో ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులోకి రానుంది. ఆరోగ్యసేతులోని డేటా సంరక్షణ కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఎంపవర్డ్ గ్రూప్ 9 చైర్మెన్ అజయ్ సాహ్నీ తెలిపారు. ఈ యాప్ కరోనాకు సంబంధించి పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఆరోగ్యసేతు డాటా అందుబాటులో ఉంటుందని,అయితే ప్రైవసీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా స్పష్టం చేశారు.
ఆ డేటా అంతటని పూర్తిగా ఎన్క్రిప్ట్ అయిన సర్వర్లో దాస్తున్నామని చెప్పారు. దీనిలో పేరు,మొబైల్ నెంబర్, వయసు, వృత్తి, గడచిన 30 రోజుల్లో విదేశీ పర్యటనలు చేసి ఉంటే ఆ వివరాలు యాప్లో పొందుపరచాల్సి ఉంటుందన్నారు. గడచిన ఆరు వారాల్లో కరోనాపై పోరులో ఆరోగ్యసేతు యాప్ సాంకేతిక పరిష్కారంలా మారి కీలక పాత్ర పోషిస్తోందని కాంత్ చెప్పారు. ఈ యాప్ వల్ల గుప్తంగా ఉన్న హాట్స్పాట్లను గుర్తించామని తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి 20 మధ్య 130 హాట్స్పాట్లను గుర్తించామని చెప్పారు. కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ యాప్ను రూపొందించింది. ఐవోఎస్తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోని హెల్త్ కు సంబందించిన హెల్ప్లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: తమిళనాట బారిగా పెరిగిన కరోనా కేసులు