America has introduced another new drug for coronavirus
కోవిడ్19 నుంచి బాధితులను రక్షించేందుకు అనేక ఔషధాల్ని పరీక్షిస్తున్న క్రమంలో కరోనా వైరస్ చికిత్సలో యాంటీ వైరస్ డ్రగ్ రెమ్డెసివిర్ వాడేందుకు అమెరికా అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ ఈ డ్రగ్ కరోనతో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్గా రెమ్డెసివిర్ యాంటీ వైరల్ ఇంజక్షన్ను వాడొచ్చునని తెలిపింది. రెమ్డెసివిర్ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన ‘గిలీడ్ సైన్సెస్’ తయారు చేస్తోంది. కోవిడ్ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్ తోడ్పడుతుందని తయారీ సంస్థ గిలీడ్ సైన్సెస్ వెల్లడించింది.
రెమ్డెసివిర్కు అనుమతులు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రాంప్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి అని పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గిలీడ్ సీఈఓతో కలిసి ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ ప్రకటించారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమించిన పరిస్థితుల్లో రెమ్డెసివిర్ను ఇవ్వాలని, రెమ్డెసివిర్ తీసుకున్న రోగులు మిగతా మందులతో పోలిస్తే 31శాతం వేగంగా కోలుకున్నారని ఎఫ్డీఏ తెలిపింది. ఈ డ్రగ్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రయోగాల్లో తేలినప్పటికీ మరిన్ని ఆధారాలు సమర్పిస్తే పూర్తి స్థాయి వినియోగానికి అనుమతిస్తామని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. 1.5 మిలియన్ డోసుల మెడిసిన్ను ఉచితంగా అందిస్తామని గిలీడ్ సైన్సెస్ ఇదివరకే చెప్పింది.