అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి రోజోరోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గురువారం విడుదల చేశారు. అందులో ఆల్ ఖైదా ఉగ్రవాది జుబేర్ మహ్మద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. అతను ఎన్నో ఉగ్రవాద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్ను 2015లో అమెరికాలో అరెస్ట్ చేశారు అతను అప్పటి నుంచి అక్కడి జైల్లో శిక్షను అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవే కాకుండా ఆల్ ఖైదా తరఫున ఎక్కువ మొత్తంలో నిధులు సమీకరించిన కేసులో కూడా ఈ ఉగ్రవాది దోషిగా ఉన్నాడు. కాకపోతే జుబేర్ మహ్మద్ హైదరాబాద్కి చెందిన వాడు కావడంతో అతడిని భారత్కి పంపించాలని అమెరికా నిర్ణయించింది. అదే క్రమంలో అతడిని మన దేశానికి పంపేందుకు అమెరికా ఓ ప్రత్యేక విమానంలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. జుబేర్ భారత్లోకి దిగగానే అతడిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్కి పంపాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: