కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ట్వీట్స్ ప్రచారం చేసిన పలువుర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా పేరుతో ఉన్న అఫిషీయల్ ట్విట్టర్ పోస్ట్ వచ్చేలా ఎడిట్ చేసి.. ఆయన ఆరోగ్యం బాగులేదంటూ దుష్ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా.. మరికొందరు ఆయన ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఫేక్ ప్రచారం చేశారు. ఆయన బోన్ క్యాన్సర్ రావడంతోనే బయటకు కన్పించడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
అయితే ఈ ఘటనపై అమిత్ షా స్వయంగా శనివారం ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అమిత్ షా హెల్త్పై వస్తున్న ట్రోల్స్పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ట్రోల్స్పై స్పందించారు. ఒకరి ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు సందేశాలను వ్యాప్తి చేస్తున్న వారి మనస్తత్వం ఏలా ఉందో అర్ధమవుతుందోని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి పేరుతో ఫేక్ ట్వీట్స్ చేసిన నలుగురిని గుజరాత్లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: 9 రోజుల్లో పూర్తి అయిన “ఆపరేషన్ అన్నపూర్ణ” మిషన్