Amma Vodi Laptop Scheme
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. స్కూల్ కి వెళ్ళి చదువుకొనే చిన్నారుల కోసం ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. గత ఏడాది 44.48 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్థి పొందారు. ఇందుకోసం రూ.6773 కోట్లను ఇచ్చినట్లుగా జగన్ ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈ పథకంలో మరో కొత్త పద్దతిని ప్రారంభించారు జగన్. తొమ్మిదో తరగతి నుంచి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు వద్దనుకుంటే వారికి ల్యాప్ టాప్ లు అందిస్తామన్నారు జగన్. కరోనా కారణంగా చాలా మంది పెద విధ్యార్ధులు కరోనా క్లాసులకు దూరమయ్యారని.. ఆ పరిస్థితుల్లో మార్పు కోసం తాము కొత్త పద్ధతిని ప్రారంబిస్తున్నట్లు చెప్పారు.
తాజాగా నెల్లూరులో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు దూరమైన పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇవ్వటం ద్వారా మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.
4జీబీ ర్యామ్.. 500జీబీ స్టోరేజీ.. విండోస్ 10 ఓఎస్ ఉన్న సిస్టమ్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటి ధర ఇంచుమించు గా పాతిక వేలు ఉండనున్నట్లు సమాచారం. వీటిని మూడేళ్ల వారెంటీతో పాటు.. పని చేయని పక్షంలో ఏడు రోజుల్లో రిపేర్లు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: