BJP AP president kanna Laxminarayana allegations over medical devices
వైద్య పరికరాల వ్యవహారంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు గుప్పించడం ,దీనికి వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇస్తూ కన్నా టిడిపికి అమ్ముడుపోయారని విమర్సించద్మతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా కన్నా మాట్లాడుతూ వైసీపీ మంత్రులు, నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. వైసిపి సర్కార్ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు కేంద్రంపై నెడుతున్నారని కన్నా మండిపడ్డారు.
వైసీపీ చేతగానితనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనమేనని విమర్శించారు.
ప్రభుత్వంపై పోరాడుతున్నందుకు తనను టార్గెట్ చేశారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు బెదిరిస్తే బెదరమని, ప్రజాసమస్యలపై పోరాడతామని కన్నా చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలని కన్నా సవాల్ చేసారు. బీజేపీ తరుపునే పోరాడుతున్నానని, తన వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచే సంప్రదాయం బీజేపీది కాదని చెప్పారు. ఏపీలో కరోనా విజృంభిస్తోందన్నారు.
ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి పెచ్చరిల్లే ప్రమాదముందని కన్నా హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తిరుగుతున్నా రని కన్నా పేర్కొంటూ, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనాపై వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దాస్తోందని కన్నా పేర్కొన్నారు. కరోనాపై వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడంలేదని విమర్శించారు. రాజకీయాలే పరమావధిగా వైసీపీ పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలను వైసీపీ గాలికొదిలేసిందని మండిపడ్డారు. అధికారమదంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అయినా ఫ్యాక్షన్ లీడర్ ఏపీ సీఎం కావడం ప్రజల దురదృష్టమన్నారు.