కరోనా వైరస్ పురుడు పోసుకున్న వుహాన్ నగరంలో మళ్లీ కలకలం చెలరేగింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో వుహాన్లో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా, లాక్డౌన్ ఎత్తివేసి ఆఫీసులు, కొన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మ్యూజియంలు, ఇతర వినోద కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. దీంతో కరోనా వైరస్ సద్దుమణిగిందని వుహాన్ వాసులు భావించారు.
అయితే తాజాగా ఇక్కడ కరోనా కలకలం మళ్లీ మొదలైంది. ఒకే కాంప్లెక్స్లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులతో పాటు మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా బారినపడినవారిలో ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమె భర్తకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా నిర్ధారణ అయిన ఐదుగురిలోనూ ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి: గాంధీ ఆసుపత్రిలో మొదలు కానున్న ప్లాస్మా థెరపీ