ఈ ఏడాది క్రికెట్ ప్రపంచం లో చాల ముఖ్యమైనది అనే చెప్పాలి ఎందుకంటే. ఈ 2020ల లో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే టీ 20 ప్రపంచ కప్, ఆసియా కప్ తో పాటుగా మన దగ్గర ప్రతి ఏడాది జరగాల్సిన ఐపీఎల్ ఉన్నాయి. దాంతో క్రికెట్ అభిమానులు చాల ఆనందించారు. కానీ వారందరి సంతోషానికి బ్రేక్ వేసింది కరోనా. ఈ వైరస్ కారణంగా ఈ టోర్నమెట్లే కాదు చాల జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ లు కూడా నిలిచిపోయాయి. ఇక కరోనా ఇచ్చిన 3 నెలల విరామం తర్వాత మళ్ళీ రేపటి నుండే అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం కానుంది. ఇందులో ఇంగ్లాండ్-వెస్టిండీస్ తలపడుతున్నాయి. అయితే కరోనా సమయం లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఇక ముందు జరగనున్న అన్ని మ్యాచ్ ల కోసం ఐసీసీ కొన్ని కొత్త కరోనా నియమాలను తీసుకవచ్చింది. రేపు సౌతాంప్టన్లో లో జరగనున్న ఈ మ్యాచ్ లో కూడా ఆ నియమాలతో పాటుగా ఇంగ్లాండ్ & వెల్స్ క్రికెట్ బోర్డు ముందు జాగ్రత్తగా మరి కొన్ని నియమాలను అందులో కలిపింది.
కొత్త కరోనా నియమాలు ఇవే:
బంతిపై సెలైవ(ఉమ్మి) వాడటం నిషేధం, షేక్ హ్యాండ్స్, ఆలింగనాలు ఉండవు, టాస్ సమయంలో రిఫరీ ఉండడు, కేవలం కెప్టెన్లు మాత్రమే,. ప్రేక్షకులకు నో ఎంట్రీ, బదులుగా వారి రికార్డింగ్ సౌండ్స్, బాల్ బాయ్స్ ఉండరు, 70 ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్స్ తప్పనిసరి.
ఇది కూడా చదవండి: