కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను చంచలగూడ జైలులో ఉంచారు. జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: