కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా మందుషాపులు తెరవగానే మందుబాబులు ఎగబడ్డారు. క్యూలైన్లలో నిలబడి లిక్కర్ కొన్నారు. అయితే కొందరు మందుబాబులకు మాత్రం రమ్ బాటిల్ ఎందుకు రా కొన్నామనిపించింది. మద్యం సీసాలను కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులకు ఒక రమ్ బాటిల్లో చచ్చిన కప్ప కనిపించింది. ఈ ఘటన తమిళనాడు శీర్గాళీలో చోటుచేసుకుంది.
తెన్పాదికి చెందిన కొందరు, శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్ షాపులో కొందరు మందు బాబులు మద్యం కొనుగోలు చేశారు. ఇక బాటిల్స్తో పొలంలోకి వెళ్లి బాటిల్ తెరిచి చూడగా షాకయ్యారు. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది. మందుతాగుదామనే మూడు పాడై వెంటనే అదికొన్న షాపు యజమాని దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వారు ఈ సమాచారం బయటకు రానివ్వకుండా వారిని కవర్ చేసినట్లుగా తెలిసింది.
ఇది కూడా చదవండి: బాయ్స్ లాకర్ రూమ్ ని నడిపించింది ఒక అమ్మాయి?