ఈరోజు (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని రాజశేఖర్ హాత్ వే రాజశేఖర్గా ఉమ్మడి రాష్ట్రంలో కేబుల్ రంగంలో తనదైన ముద్ర వేశారు. 1968 ఏప్రిల్ 4 న విజయనగరం జిల్లా సీతానగరం లో జన్మించిన ఆయన తొలిసారి విశాఖపట్నంలో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే హైదరాబాద్ వేదికగా మొదలైన హాత్ వేలో రీజినల్ హెడ్గా భాద్యతలు స్వీకరించారు. హాత్ వేను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్ గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో హాత్ వేకు తిరుగులేకుండా చేయడంలో ఆయనదే కీలకపాత్ర. తొలిసారి ఎమ్మెస్వోల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం శ్రమించారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్వో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేశారు. ప్యాకేజిల పేరుతో చానల్స్ ఎంఎస్వో లని వేధించిన సమయంలో రాజశేఖర్ అనేక ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఎమ్మెస్ఓలు, ఆపరేటర్లు లాభపడేలా చూశారు. కేబుల్ రంగంలో తనదైన ముద్రవేసిన రాజశేఖర్ గుండెపోటుతో మరణించడం. కేబుల్ రంగానికి తీరని లోటని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: