ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వన్డే సిరీస్లలో వరుస ఓటములతో సతమతమైన టీమిండియా టీ20లో విజయభేరితో ప్రారంభించింది. శుక్రవారం కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇకపోతే భారత్ టీ-20ల్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజయం తో భారత్ వరుసగా 9 టి20 మ్యాచ్చుల్లో విజయం సాధించింది. ఇలా వరుసగా 9 టి20 మ్యాచ్ లు భారత్ గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి.
భారత బౌలర్లు అదరగొట్టడంతో భారత్ విజయం సునాయాసమైంది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్… ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఎదుట ఉంచింది. జడేజా, రాహుల్ రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు ను చేరుకోగలిగింది.
ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి తొలుత ఓపెనర్లుగా బరిలో దిగిన ఆసీస్ ప్లేయర్లు షార్ట్, ఆరోన్ ఫించ్ ఆ జట్టుకు మంచి శుభారంభాన్నే ఇచ్చారు. అయితే ఆరోన్ ఫించ్ అవుట్ అవడంతో ఆసీస్ కష్టాలు మొదలయ్యాయి. ఫించ్ తరువాత వచ్చిన బ్యాట్స్మెన్లు అందరూ వరుసగా పెవిలియన్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 150 పరుగుల చేసి 11 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇవి కూడా చదవండి: