ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి ఇవాళ PSLV C-49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా పది ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C-49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. నిన్న మధ్యాహ్నమే ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడ్డ ప్రయోగాలను తిరిగి ప్రారంభించబోతోంది ఇస్రో. ఈఓఎస్-01 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. వ్యవసాయం, అటవీ రంగాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రజలకు కూడా అనుమతి లేదని ఇస్రో తెలిపింది.
ఇది కూడా చదవండి: