Tamil Nadu Governor
టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు తమిళనాడు గవర్నర్ గా పదవీబాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్టు వార్త హల్చల్ చేస్తుంది. 2017 అక్టోబర్ లో గవర్నర్ పదవి చేపట్టిన భన్వరీలాల్ స్థానంలో కృష్ణం రాజుని నియమించనున్నట్టు సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే, గతంలో ఎన్డీయే గవర్నమెంట్ లో కేంద్ర మంత్రి గా భాద్యతలు నిర్వహించారు కృష్ణంరాజు.
సుదీర్ఘ కాలం నుంచి బిజెపిలోనే కొనసాగుతున్న కృష్ణంరాజుకు ఇన్నాళ్లకు సరైన గుర్తింపు లభించే అవకాశం వుంది. ఇంకా తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ఇదే సరైన అదునుగా భావించి కృష్ణంరాజును గవర్నర్గా పంపాలని నిశ్చయించినట్టు సమాచారం. అయితే తమ అభిమాన హీరో పెదనాన్నకు గవర్నర్ పదవి దక్కనుందన్న వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి: