Nivar Cyclone
గత నెలలో వచ్చిన నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడు, ఎపి లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఈ రెండు జిల్లాలు కుదేలు అయ్యాయి. దీనితో పాటు అపారమైన పంటనష్టం జరిగింది. అయితే, ఈ నివర్ తుఫాన్ ఏపీలోని ఓ గ్రామానికి మాత్రం మేలు చేసింది. అదేమిటంటే, ఆ గ్రామంలోని ప్రజలకు బంగారం తీసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలోని గ్రామం ఉప్పాడ. ఈ గ్రామం, సిల్క్ చీరలకు ప్రసిద్ధి కూడా.
ఇటీవలే నివర్ తుఫాన్ తరువాత ఉప్పాడ బీచ్ లో అక్కడి ప్రజలకు బంగారం దొరికింది. నలుగురు వ్యక్తులకు బంగారం దొరకడంతో ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించింది. దీంతో గ్రామంలోని ప్రజలంతా ఉప్పాడ బీచ్ కి వచ్చేశారు. బంగారం కోసం వేట మొదలుపెట్టారు. మొత్తంగా 2 లక్షల రూపాయిల విలువ చేసే బంగారం దొరికినట్టు సమాచారం. దగ్గరలో ఉన్న దేవాలయం సముద్రంలో కలిసిపోవడం లేదా తీరప్రాంతంలోని ఇల్లు సముద్రంలో కలిసిపోవడం వలన బంగారం ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఇది కూడా చదవండి: