ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించి ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. జార్జియా, మిచిగాన్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన బ్యాలెట్లు చెల్లుబాటు కావంటూ ట్రంప్ ప్రచారం బృందం దాఖలు చేసిన దావాను తిరస్కరించామని జార్జియా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేమ్స్ బాస్ స్పష్టం చేశారు. ఇవి చెల్లుబాటు కావనడానికి ఆధారాల్లేవని పేర్కొన్నారు.
అయితే అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే ఈ మూడు రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. నెవాడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా. జార్జియాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. మిచిగన్లో మాత్రం బైడెన్ స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతున్నారు. మాజీ అధికారి రిచర్డ్ గ్రెనెల్తో సహా నెవాడా మాజీ అటార్నీ జనరల్ ఆడమ్ లక్సాల్ట్, ఇతర ట్రంప్ ప్రచారం బృందం గురువారం లాస్ వేగాస్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలకు ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. అంతేకాకుండా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ‘చనిపోయిన ఓటర్లు లెక్కించినట్టు మేము బలంగా నమ్ముతున్నాం. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ సమయంలో క్లార్క్ కౌంటీ నుంచి బయటికి వెళ్లిన వేలాది మంది ఓట్లు ఇందులో ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం” అని లక్సాల్ట్ చెప్పారు. చెల్లని ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దావా వేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: