మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు. కమాండోలను వదిలిన తర్వాత గాయపడ్డ జవాన్లను తరలిస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్లు ఢీకొన్నట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ ప్రమాదంలో 15 మంది మాత్రమే మరణించినట్లు మరో వర్గం ద్వారా తెలిసింది. అయితే ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఆఫ్ఘన్ రక్షణ శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి: